4 రోజుల కవల పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి!

కాలం మారింది.ఆడపిల్లలు, మగపిల్లలు తేడా లేదు ఎవరైనా ఏ పని అయినా చెయ్యగలరు.

 Father Poisoned Twin Girls, Father Poisoned, Twin Girl Child, Mahaboob Nagar, Tw-TeluguStop.com

మగపిల్లల కంటే ఆడపిల్లలలే ఎక్కువ పనులు చేస్తున్నారు.కానీ ఆడపిల్ల అంటే ఇప్పటికి చులకనే.

ఇక అలానే ఇద్దరు కవల పిల్లలను దారుణంగా చంపేశాడు ఓ కసాయి తండ్రి.ఈ దారుణ ఘటన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.దేశాయిప‌ల్లికి చెందిన కృష్ణ‌వేణి, కేశ‌వులు దంప‌తుల‌కు సెప్టెంబర్ 1 వ తేదీన రాత్రి కవల పిల్లలు పుట్టారు.అప్పటికే వారికి ఒక కూతురు ఉంది.మళ్లీ కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో తండ్రి జీర్ణించుకోలేకపోయారు.

కోపంతో ఆ పిల్లలను ఇద్దరిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో భార్యకు తెలియకుండా శిశువులు ఇద్దరికీ పురుగుల మందు తాగించాడు.

పిల్లలు ఇద్దరు అపస్మారక స్థితికి చేరడంతో తల్లి ఆ శిశువులను ఇద్దరినీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.వారిని పరిశీలించిన వైద్యులు వారిద్దరికి విషం ఇచ్చినట్టు గుర్తించారు.మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ద‌వాఖాన‌కు శిశువుల‌ను తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా తండ్రి పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అవ్వగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube