వావి వరసలు మరిచిన ఓ తండ్రి చేసిన నిర్వాకంతో అతడు జైలుపాలైన వైనం తాజాగా వెలుగు చూసింది.కొత్తగూడెంకు చెందిన రమేశ్(55) తన కూతురు వద్దకు చుట్టం చూపుగా వెళ్లాడు.
తన అల్లుడు ఇంట్లో లేని సమయంలో తన కూతురు అనే విషయం మరిచి వికృత చేష్టలు చేయసాగాడు.దీంతో ఆ కూతురు తన తండ్రి చేసిన చేష్టలకు విసుగెత్తి పోయి పోలీసులను ఆశ్రయించింది.
మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించిన ఆ కూతురు తన తండ్రి చేసిన వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో అతడిని వారు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.కాగా అతడి నేరం రుజువు కావడంతో అతడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించింది కోర్టు.
సభ్యసమాజాం తలదించుకునేలా ఆ తండ్రి చేసిన నిర్వాకంతో కన్నకూతురికి కూడా రక్షణ లేకుండా పోయిందని పలు మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి.ఇలాంటి కామాంధులను మరింత కఠినంగా శిక్షించాలంటూ పలువురు సామాజిక వేత్తలు కోరుతున్నారు.