మన భారత సంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భార్య జీవితాంతం వితంతువుగానే మిగిలిపోతుంది.ఆమెకు పిల్లలు ఉన్నారు అంటే వారిని చూసుకుంటూ జీవితం గడిపేస్తుంది.
ఇంకా ఇదే మన సాంప్రదాయం.అయితే మారుతున్న కాలంలో కొందరు మహిళలు భర్త చనిపోతే మరో పెళ్లి చేసుకుంటున్నారు.
ఇంకా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు మాత్రం ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
ఇంకా ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది.కొడుకు చనిపోయి రెండేళ్లుగా మనోవేదన భరిస్తున్న కోడలి భాదను చూడలేక కోడలిని పెళ్లిచేసుకున్నాడు.
ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఈ ఘటన జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన గౌతమ్ సింగ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు.దీంతో ఆర్తిసింగ్ రెండు సంవత్సరాలుగా వితంతువుగా ఉంటుంది.
అయితే భర్త లేని ఒంటరి తనంతో తన బాధ ఎవరికి చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఇంకా భర్త చనిపోయిన సమయం నుండి భర్త తండ్రి, తన మామ అయిన కృష్ణ రాజ్పుత్ సింగ్ వద్దే ఉంటుంది.
ఇంకా ఈ నేపథ్యంలో రాజ్పుత్ క్షత్రియ మహాసభ సంప్రదాయం ప్రకారం గౌతమ్ సింగ్ తండ్రి కృష్ణ రాజ్పుత్ను ఆర్తిసింగ్ ను పెళ్లి చేసుకున్నాడు.
అయితే దీనికి కోడలు కూడా ఒప్పుకుంది.
రెండేళ్లుగా మామ తనను ఎంతో బాగా చూసుకోవడంతో ఆమె పెళ్లికి ఒప్పుకుంది.దీంతో ఈ ఘటన గురించి తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.
ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు అంటూ ఆశ్చర్యపోతున్నారు.