మహిళల మీద జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.ఇప్పటికే చిన్న పిల్లలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో వింటూనే ఉన్నాం.
ఎన్ని శిక్షలు విధించినా ఎంతమంది రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేసినా ఆడవారిపై ఆకృత్యాలు మాత్రం ఆగట్లేదు.ఇక మరీ ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
వావి వరసలు కూడా పక్కన పెట్టేసి చిన్నారులపై సొంత బంధువులు, చివరకు అన్నలు కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ఇలాంటి ఉదంతమే ఇప్పుడు యూపీలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దారుణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఓ 17 ఏళ్ల బాలికపై దాదాపుగా ఐదేళ్లుగా తన తండ్రితో సహా మామతో కలిపి 25మంది అత్యాచారం చేస్తున్నారంటూ ఆ చిన్నారి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఐదేండ్లుగా తనకు వారంతా కలిసి నరకం చూపిస్తున్నారని కన్న తండ్రి కూడా తనను వదలకుండా ఇలా చేస్తున్నాడంటూ వాపోయింది ఆ బాలిక.దాంతో పోలీసులు రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు మొదలు పెట్టారు.
అయితే ఈ కేసులో లలిత్పూర్ జిల్లాకు ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఉన్నటువంటి తిలక్ యాదవ్ కూడా ఉండటం సంచలనం రేపుతోంది.
దాంతో పాటు బహుజన సమాజ్ పార్టీ కీలక నేత అయిన దీపక్ అహిర్వార్ ను కూడా పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు.
చాలా పెద్ద వాళ్లు ఈ కేసులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.ఇప్పటి దాకా తాము ఏడుగురిని అరెస్టు చేశామని, ఎస్పీ నిఖిల్ పాఠక్ వివరించారు.
బాలిక తండ్రి దగ్గరుండి మరీ ఆమెపై ఇలా అత్యాచారం చేయించారని బాలిక ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.ఇంకా చాలామంది ఎస్పీ, బీఎస్పీ పార్టీలో జిల్లాలో నాయకులు ఉండటంతో వారు పరారీలో ఉన్నట్టు ఎస్పీ వివరించారు.
త్వరలోనే వారందరినీ అరెస్టు చేయిస్తామని వెల్లడించారు.
.