కళాశాల ఫీజు కోసం తండ్రి అప్పు చేయడంతో మనస్తాపంతో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు వనపర్తి పట్టణంలోని హరిజనవాడ కు చెందిన లావణ్య హైదరాబాద్ లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది.
ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులు వింటుంది.ఆమె తండ్రి వెంకటయ్య కానాయపల్లిలోని మిషన్ భగీరథ కార్యాలయలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలిపని చేస్తూ కూతుర్ని, కుమారుని చదివిస్తున్నారు.
వారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య తండ్రిని డబ్బులు అడిగింది దీంతో ఆయన 8 వేలు రూపాయలు తెచ్చి ఇచ్చి పనికి వెళ్ళాడు.తల్లి, తమ్ముడు కూడా బయటికి వెళ్లారు.
ఈ క్రమంలో తమ కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి మనస్థాపానికి గురైన లావణ్య మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుంది.కొద్దిసేపటికి స్థానికులు సూచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.