మద్యం మత్తులో కూతుళ్ళపై తండ్రి అఘాయిత్యం..!

దేశంలో ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చిన మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.రోజురోజుకు కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.

 Medchel, Father, Daughter, Murder-TeluguStop.com

సభ్య సమాజం తలదించుకునే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.కొన్ని ఘటనలు అయితే మానవత్వానికి మచ్చ తీసుకొచ్చేలా ఉంటున్నాయి.

అమ్మాయిలకు సమాజంలోనే కాదు ఇంట్లోను రక్షణ లేకుండా పోయింది.కంటికి రెప్పగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతుళ్లపై అఘాత్యానికి పాల్పడ్డాడు.

ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సీసాలబస్తీలో గత కొద్దికాలంగా మాసాని రాజు కుటుంబం జీవనం సాగిస్తున్నారు.అయితే అతని భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

రాజు నివాస ప్రాంతానికి దగ్గరలో ఉండే పిండి గిర్నిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే అతడి భార్య కొన్ని నెలల క్రితం మరణించింది.

భార్య మరణంతో మనస్తాపం చెందిన రాజు మద్యానికి బానిసై ఇద్దరి కూతుళ్ళపై లైంగిక వేధింపులకు గురి చేసేవాడు.మంగళవారం రాత్రి కూడా రాజు మద్యం మత్తులో కూతుళ్లపై మళ్ళి వేధింపులకు గురి చేయడంతో ఇద్దరు కూతుళ్లు రాజును హత్య చేశారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube