ఐపీఎల్ ఫీవర్ ఎక్కడెక్కడో ఉన్న క్రికెట్ అభిమానులను ఎంజాయ్ చేసేలా చేస్తుంది.ప్రతి సీజన్ ఐపీఎల్ యువతకు ఒక మంచి ఎక్సయిటింగ్ కలిగేలా చేస్తుంది.
సీజన్ సీజన్ కు ఫార్ములాలు మారడం.జట్ల మధ్య తీవ్రమైన ఫైట్.
ఐపీఎల్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజా ఇస్తుంది.అయితే ఈ జోష్ ఎవరు కావాలని కోరుకోరు చెప్పండి.
అందుకే తమకు ఐపీఎల్ ప్రసారాలు కల్పించాలని జైలులో ఉన్న ఖైదీలు కూడా కోరుతున్నారు.కోరడమే కాదు అందుకు నిరాకరించారని ఖైదీలు నిరాహార దీక్షకు దిగడం విశేషం.
ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.ఉత్తర్ ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో జరిగింది.
ఫతేగడ్ కేంద్ర కారాగారంలో ఖైదీలు తమకు ఐపీఎల్ ప్రసారాలు చూసేలా ఏర్పాటు చేయమని కోరారు.అయితే వారి కోరికని పెడ చెవిన పెట్టడంతో అక్కడ ఖైదీలంతా ఐపీఎల్ చూడాలని నిరాహారదీక్షకు దిగారు.
అలా నిరాహారాదీక్షకు దిగడంతో చేసేదేమి లేక జైలు అధికారులు అంగీకరించి ఐపీఎల్ చూసే సౌకర్యాన్ని కలిగించారు.అక్కడ జైలు సూపరింటెండెంట్ లఖ్ నవూలో అధికారులతో సమావేశమైనప్పుడు ఈ నిరసన తెలియడంతో వెంటనే జైలుకి వచ్చి వారికి ఐపీఎల్ చూసే ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది.
జైలులో ఖైదీలను కూడా ఐపీఎల్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.