దిశ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ కోర్టు ప్రభుత్వానికి సమాచారమిచ్చింది.
దిశ హత్యచారం కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని హైకోర్టుకు లేఖ రాసింది.ఈ లేఖలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది.
ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు.దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ వేగంగా సాగనుంది.రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకావం ఉంటుంది.