ఈ మధ్యకాలంలో జెండర్ చేంజ్ అనేది చాలా చిన్న విషయం అయిపోయింది.ఒకప్పుడు సొసైటీలో ఎవరైనా తమ వ్యక్తిత్వం గురించి చెప్పుకోవడానికి ఇబ్బంది పడి రహస్యంగా ఉంచేసేవారు.
మగవారిలో ఆడవాళ్ళ లక్షణాలు, ఆడవారిలో మగవాళ్ల లక్షణాలు కొంతమందిలో ఉన్న వారు సమాజం నుంచి ఎదురయ్యే వేధింపులు, చీదరింపులకి భయపడి బయటకి వచ్చేవారు కాదు.అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వారికి కూడా గుర్తింపు వచ్చింది.
ప్రభుత్వ దరఖాస్తులలో కూడా థర్డ్ జెండర్ అనేదానికి ప్రాధాన్యత ఇచ్చింది.అలాగే స్వలింగ సంపర్క రిలేషన్ తప్పుకాదని కూడా తేల్చేసింది.
దీంతో తమది కానీ వ్యక్తిత్వం శరీర లక్షణంతో ఉన్న చాలా మందికి స్వాతంత్య్రం వచ్చినట్లు అయ్యింది.సమాజం ఎం అనుకున్న తమకి నచ్చినట్లు బ్రతకాలనే ఆలోచనతో కొంత మంచి తమ వ్యక్తిత్వాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తున్నారు.
మరికొంత మంది అబ్బాయిల నుంచి అమ్మాయిలుగా మారిపోతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ తో అందరికి చేరువ అయిన సాయితేజ జెండర్ చేంజ్ చేసుకొని ప్రియాంకాగా మారిపోయింది.ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరైన స్వాప్నిల్ షిండే తాను ట్రాన్స్ వుమన్ ని అని ప్రకటిస్తూ తన ఒరిజినల్ రూపాన్ని ఆవిష్కరించారు.నా పేరు సైషా.
నేను అమ్మాయిగా మారాను అంటూ ధైర్యంగా ప్రకటించుకున్నారు.తాను హిజ్రాను కాబోనని అన్నారు.
దీనిపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.అందరి నుంచి ప్రేమ భావన వ్యక్తమవుతోంది.
ఆమెగా మారాక తన రూపాన్ని రివీల్ చేస్తూ తనను తాను ట్రాన్స్ వుమన్ అని ప్రకటించగానే చాలా మంది సెలబ్రిటీలు కామెంట్ల విభాగంలో సైషాపై ప్రశంసలు కురిపించారు.చాలా గొప్ప పని చేసావని శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
సన్నీ లియోన్, అదితీ రావు హైదారి, అమృతా ఖాన్విల్కర్, శిల్పా శిరోద్కర్, లోపాముద్ర రౌత్ ఆమెకి విషెస్ తెలిపారు.సైషా చివరిగా బూర్జ్ ఖలీఫా పాటలో కియారాకి ఫ్యాషన్ డిజైన్ చేసింది.