స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కు ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దీ మంది స్నేహితులలో శిల్పా రెడ్డి ఒకరు.ఈమె తో కలిసి సమంత ఈ మధ్యనే ఛార్ ధామ్ యాత్ర కూడా చేసారు.
వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం టాలీవుడ్ లో అందరికి తెలుసు.వీరిద్దరూ కలిసి చాలా సార్లు బయట కనిపించారు.
ఇక శిల్పా రెడ్డి ప్రముఖ డిజైనర్ అలాగే మోడల్ కూడా.
అంతేకాదు నటుడు సమీర్ రెడ్డికి శిల్పా రెడ్డి సోదరి.
ఈమె తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులను కలిసింది.వాళ్లతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక జగన్ దంపతులను విజయవాడలో కలిశానని శిల్పా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.ఇంస్టాగ్రామ్ లో శిల్పా రెడ్డి జగన్ మోహన్ రెడ్డి దంపతులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన మనసులోని మాటలను తెలిపింది.
ఆమె జగన్ మోహన్ రెడ్డిని, భార్య భారతి ని మర్యాద పూర్వకంగా విజయవాడలో కలిసినట్టు చెబుతూ ఫోటో షేర్ చేసింది.” ఇంత ఆతిధ్యం.ప్రేమ.ఆప్యాయత తో నన్ను మీ ఇంటికి స్వాగతించి నందుకు ధన్యవాదాలు భారతి, జగన్ గారు ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ శిల్పా రెడ్డి సోషల్ మీడియా వేదికగా వాళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.
ఈ ఫోటో ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఈ ఫొటోలో జగన్ తో పాటు ఆయన భార్య భారతి వీరితో పాటు శిల్పా రెడ్డి కనిపిస్తున్నారు.అయితే శిల్పా రెడ్డి ఎందుకు సీఎం జగన్ ను కలిసిందో మాత్రం తెలపలేదు.ఇక ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ శిల్పా ఎందుకు సీఎం జగన్ ను కలిశారా అని ఆరా తీస్తున్నారు.
దీని వెనుక కారణం ఏమై ఉంటుందా.రాజకీయ పరంగా నా లేదంటే మరేదన్న కారణం ఉంటుందా అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీగా ఉన్నారు.