భారతదేశంకు వెన్నుముఖ రైతు.అలాంటి రైతుకు ప్రతిసారి కూడా బడ్జెట్లో నిరాశే మిగులుతుంది.
కాని ఈసారి మాత్రం కాస్త పర్వాలేదు అన్నట్లుగా కేటాయింపులు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బడ్జెట్లో 15 లక్షల కోట్ల రూపాయలను రైతుల రుణాల కోసం కేటాయించడం జరిగింది.
అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంకు కూడా భారీగా నిధులు కేటాయించడం జరిగింది.తెలంగాణలో అమలు చేస్తున్నట్లుగా దేశ వ్యాప్తంగా కూడా రైతు బంధును ఇస్తున్న విషయం తెల్సిందే.
జాతీయ స్థాయిలో రైతులకు పెట్టుబడి నిధుల కింద కూడా భారీ మొత్తాలను కేటాయించడంతో రైతులకు రైతు బంధుతో పాటు ప్రధాని డబ్బులు కూడా పడే అవకాశం ఉందని ఈ సందర్బంగా బడ్జెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోలార్ పంపు సెట్లు, సోలార్ యూనిట్లు, భూసార కేంద్ర పరీక్షలకు కేంద్రాలు ఇలా పలు రకాలుగా రైతులకు వెన్ను దన్నుగా నిలిచేందుకు కేటాయింపులు చేసినట్లుగా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.