అమెరికాతో పాటు భారత్లో సంచలనం సృష్టించిన ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో తెలుగు ఎన్ఆర్ఐ ఫణిదీప్ కర్నాటీకి యూఎస్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.నకిలీ విద్యార్ధులను చేర్చే వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కేసులో ఆయన నేరం రుజువు కావడంతో డెట్రాయిట్ కోర్టు ఫణిదీప్ను దోషిగా నిర్ధారించింది.
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరడానికి ముందు ఫణిదీప్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ అభ్యసించాడు.ఆరు నెలల జైలు శిక్ష అనంతరం అతనిని అమెరికా ప్రభుత్వం భారత్కు తిప్పిపంపనుంది.
కాగా దేశంలో చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు గాను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు 2015లో డెట్రాయిట్లోని ఫార్మింగ్టన్ హిల్స్లో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.దీనికి ప్రభుత్వ గుర్తింపు వుందని వర్సిటీ వెబ్సైట్లో వెల్లడించారు.
నిజానికి ఈ వర్సిటీకి ఎలాంటి కార్యాలయం, అధ్యాపకులు, సిబ్బంది లేరు కేవలం ఇది పేపర్లపైనే కనిపిస్తుంది.
ఈ సంగతి తెలియని దళారీలు, వీసా గడువు ముగిసినవారిని తప్పుడు పత్రాలతో పెద్ద సంఖ్యలో ఫార్మింగ్టన్ వర్సిటీలో చేర్పించారు.ఇందుకోసం విద్యార్ధుల వద్ద నుంచి దళారీలు భారీగా డబ్బు వసూలు చేశారు.కొంతకాలం పాటు నిఘా పెట్టిన హోంలాండ్ సెక్యూరిటీ సరిగ్గా సమయం చూసి అందరినీ తమ గుప్పిట్లో బంధించింది.
దీంతో దళారీలు, విద్యార్ధులు అవాక్కయ్యారు.ఈ కేసులలో ఎనిమిది మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేయగా.
బాధితులుగా మిగిలింది కూడా భారతీయులే కావడం దురదృష్టకరం.మొత్తం 250 మంది విద్యార్ధులను అదుపులోకి తీసుకున్న హోంలాండ్ సెక్యూరిటీ వారిని మాతృదేశాలకు వెనక్కి పంపింది.