పశ్చిమ గోదావరి జిల్లాని టెన్షన్ పుట్టిస్తుంది వింత వ్యాధి.గతంలోనే ఏలూరులో ఈ వ్యాధి బయటపడటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
దాదాపు రెండు రోజుల వ్యవధిలోనే కొన్ని వందల కేసులు రావడంతో కరోనా వైరస్ కంటే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా వుందని కేంద్ర మరియు రాష్ట్ర వైద్య బృందాలు వ్యాధికి మూల కారణం ఏంటో కొనుక్కోడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వ్యాధి తీవ్రత బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఏలూరు లో దిగారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏలూరు చుట్టుప్రక్కల గ్రామాల్లో అవే లక్షణాలతో.కళ్లు తిరిగి పడిపోవడం, మూర్ఛ.
ఇంకా మరికొన్ని లక్షణాలతో ప్రజలు ఇప్పుడు హాస్పిటల్ పాలవుతున్నారు.ఎక్కువగా పొలాల్లో పని చేసే రైతులు ఈ వ్యాధికి గురి కావడంతో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఒంటరిగా పొలంలోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.
మరోపక్క ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఆల్రెడీ ఒకసారి ఏలూరులో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.
అయినా కానీ మరోసారి రిపీట్ అయిందంటే ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వం పై మండి పడుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా నీటి కాలుష్యం వల్లే ఈ విధమైన వింత వ్యాధి జిల్లాలో ప్రబలుతున్నటు వైద్య అధికారులు చెప్పుకొస్తున్నారు.