రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల ఫాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లో నిన్నటి రోజున అకాల వర్షంతో తడిసి పోయిన వరి ధాన్యాన్ని ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు ధైర్యపడవద్దని మంత్రి కేటీ రామారావు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లుకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఎంపీపీ మానస రాజు తెలియజేశారు.
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తంగళ్ళపల్లి లోని సప్తగిరి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు వెళ్లి మిల్లు యాజమాన్యం కొనుగోలు చేసే విధంగా వారితో మాట్లాడి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం జరిగింది.
తడిసిన ధాన్యాన్ని కాంటా పెట్టి త్వరగా మిల్లుకు పంపాలని సెంటర్ ఇన్చార్జిను సిబ్బందిని ఆదేశించిన ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గజబింకార్ రాజన్న, ఎంపీటీసీ కోడి అంతయ్య, సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, వార్డు సభ్యులు రెడ్డి పరుశురాములు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దోర్నాల జయరాం రెడ్డి, మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, ఎడమల బాల్రెడ్డి రంగు అంజయ్య దొందటి రాజు, బేద్రం నారాయణరెడ్డి, ఏగొర్ల కర్ణాకర్ రైతులు పాల్గొన్నారు.