గత కొద్ది రోజులుగా దేశంలో చాలా చోట్ల రైతులు తమ డిమాండ్లు, పంటలకి గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, రాస్తారోకో, ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మహారాష్ట్రలో రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీ చేసారు.
ఇక రైతుల ర్యాలీకి దిగి వచ్చిన ప్రభుత్వం వారి డిమాండ్స్ పరిష్కారం కోసం హామీ ఇవ్వక తప్పలేదు.అలాగే తెలంగాణలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో కూడా రైతులు గత కొద్ది కాలంగా మద్దతు ధర కోరుతూ ఆందోళన చేస్తున్నారు.
రాస్తారోకోతో జాతీయ రహదారిలో రాస్తారోకో నిర్వహించారు.
ఇదిలా వుంటే తాజాగ పంజాబ్ లో రైతులు భారీ ఎత్తున ఆందోళనకి దిగి రైల్ రోకోకి దిగారు.
దీంతో రైల్ రోకోలో రైతులు పెద్ద ఎత్తున ధర్నాకి దిగడంతో రైళ్ళ రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇక రైతుల మహా ధర్నా, రైల్ రోకో కారణంగా సుమారు 34 ట్రైన్స్ ని రద్దయినట్లు తెలుస్తుంది.
అయితే ఈ రైతుల ఆందోళన విషయంలో ప్రభుత్వం స్పందించలేదని తెలుస్తుంది.