తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ రైతులు సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు.వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజను తామే కొంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారని రైతులు పేర్కొన్నారు.