కేజీఎఫ్ సినిమా తో ఆల్ ఇండియా స్టార్ హీరోగా కన్నడ స్టార్ యశ్ నిలిచాడు.ప్రభాస్ తర్వాత సౌత్ నుండి పాన్ ఇండియా రేంజ్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో గా యశ్ పేరు దక్కించుకున్నాడు.
అలాంటి యశ్ చేస్తున్న పనులు ఆయనపై చెడ్డ ముద్ర వేస్తున్నాయి.ఇటీవల ఆయన ఒక భూ వివాదం కు కేంద్రం అయ్యాడు.
ఆయన తల్లి సొంత గ్రామంలో 80 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.ఆ భూమి కొనుగోలు విషయం లో మొదట యశ్ రాలేదు.కాని ఎప్పుడైతే ఆ భూమి వివాదం మొదలు అయ్యిందో అప్పటి నుండి అమ్మ నాన్నకు మద్దతుగా నిలిచాడు.80 ఎకరాల భూమికి యశ్ తల్లి దండ్రులు కంచె వేయిస్తూ ఉండటం వల్ల అవతలి వైపు ఉన్న రైతులు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది.రోడ్డును మూసి వేస్తున్న కారణంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు వారు ఈ విషయమై యశ్ నుండి సహకారం వస్తుందనుకుంటే ఆయన రౌడీలతో గూండా గిరి చేయిస్తున్నాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల యశ్ పై రైతు సంఘాల నాయకులు మరియు కొందరు రైతులు స్వయంగా కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఆ ఫిర్యాదులో కంచె వేసేందుకు అడ్డు పడ్డ రైతులను రౌడీ లో యశ్ బెదిరిస్తున్నాడు అంటూ పేర్కొన్నారు.కలెక్టర్ హీరో యశ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసిన రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రౌడీ లతో రైతులను బెదిరించిన యశ్ పై చర్యలు తీసుకోకుంటే తాము ఆందోళనలు ఉదృతం చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్నారు.ఈ విషయమై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒక హీరో అయ్యి ఉండి యశ్ రౌడీలా ప్రవర్తించడం ఏంటీ అంటూ ఉంటే మరి కొందరు యశ్ అలా కాదంటున్నారు.చివరకు ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాలి.