లంచం అడిగిన అధికారికి ఆ రైతు ఎలా బుద్ది చెప్పాడో తెలుసా.? దెబ్బకి ఎమ్మార్వోకు చుక్క‌లు కనిపించాయి!

లంచం అడుగుతావా నీకు కరెక్టు బద్ది చెబుతా అంటూ ఓ రైతు వినూత్నంగా బదులు చెప్పాడు.ఈఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గాపూర్‌లో చోటు చేసుకుంది.

 Farmer Tied His Buffalo To The Vehicle Of Tehsildar In Mp-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.

లక్ష్మీ యాదవ్ అనే ఓ రైతు ఖర్గాపూర్ తహసీల్ పరిధిలో ఉండే ఓ భూమికి సంబంధించి అర్జీ పెట్టుకున్నాడు.

అయితే, అందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్ సునీల్ వర్మ డిమాండ్ చేశాడు.చివరకు రైతు లక్ష్మీయాదవ్ తన బంధువుల దగ్గర అప్పుచేసి 50వేలు ఆ అధికారికి ఇచ్చారు.

మిగతావి త్వరలోనే చెల్లిస్తామని బతిమాలాడ.అయినా సరే అతని పేరిట భూమి బదిలీ చేయకపోవడంతో రైతు ఆవేదన చెందాడు.

చేసేది ఏమీ లేక తన బర్రెను తీసుకెళ్లి ప్రభుత్వానికి చెందిన జీపుకు కట్టేసినట్లు పేర్కొన్నారు.అక్కడే గడ్డి వేసి బర్రె ఆకలిని తీర్చాడు యాదవ్.ఇతని పరిస్థితి తెలుసుకున్న కొంతమంది సెల్ ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.చివరికి ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మార్వోపై విచారణకు ఆదేశించారు.

ఈ విచారణలో ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశాడని ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.అలాగే రైతుకు సంబంధించిన మ్యూటేష‌న్‌ను వెంట‌నే చేయాల‌ని స‌ద‌రు అధికారుల‌ను ఆదేశించాడ‌ట క‌లెక్ట‌ర్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube