పొలం కొన్న అల్లు అర్జున్.. ఖరీదు ఎంతో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు బాగా పాపులారిటీ వచ్చిన తర్వాత ఆస్తులను కొనుగోలు చేయడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే స్టార్ హీరో హీరోయిన్లు పలు ప్రాంతాలలో ఇంటిని, ఫ్లాట్లను కొనుగోలు చేయడం మనం చూస్తున్నాము.

 Farm Registration Allu Arjun At Shankar Palli Mandal Tasildar Office, Allu Arjun-TeluguStop.com

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపిక పదుకొనే జంట గతకొద్ది రోజుల క్రితం కొబ్బరి తోటలు పొలాలు కొన్నట్లు తెలియజేశారు.ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పొలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల జనవాడ గ్రామంలో ఈయన రెండు ఎకరాల పొలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే శంకర్ పల్లి తహసిల్దార్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అల్లు అర్జున్ తను కొనుగోలు చేసిన రెండు ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ పనుల కోసం వెళ్లారు.

అనంతరం తహసిల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు. అయితే అతను కొనుగోలు చేసిన రెండు ఎకరాల పొలం విలువ లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.

అయితే శంకర్ పల్లి మండల తహసిల్దార్ కార్యాలయానికి అల్లుఅర్జున్ వచ్చారన్న విషయాన్ని తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయనతో కలిసి ఫోటోలు దిగడం కోసం తాపత్రయపడ్డారు.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ 17న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube