టాలీవుడ్ సినీ పరిశ్రమలో విజయ్ దేవరకొండ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.కేవలం అర్జున్ రెడ్డి సినిమా తో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు విజయ్.
అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు కూడా విజయ్ దేవరకొండ పై మంచి క్రేజీ ని చూపిస్తున్నారు.ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తో రొమాన్స్ కావాలంటున్న నటి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి నటిస్తున్న జాతి రత్నాలు సినిమా లో నటిస్తున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఈమె టాలీవుడ్ కు తొలిసారిగా ఈ సినిమాతో పరిచయం కానుంది.
ఇక ఈ సినిమాలో విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇక ఈ సినిమా గురించి హీరోయిన్ ఫరియా కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది.ఈ సినిమా వల్ల ఆమెకు మంచి అవకాశాలు వస్తాయని ఆశ ఎక్కువగా ఉందని తెలుపుతుంది.
అంతే కాకుండా ఈమెకు ఇద్దరు యంగ్ హీరోలు ఇష్టమట.అందులో ఒకరు మలయాళ హీరో పహద్ ఫాసిల్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తనకు ఎంతో ఇష్టమట.విజయ్ దేవరకొండ తో తనకు రొమాన్స్ చేయాలనుందని చెప్పుకొచ్చింది.
ఈ సినిమా తర్వాత తనకు ఆఫర్లు వస్తాయని వాటి గురించి ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమా మార్చి 11న శివరాత్రి రోజున విడుదల చేయడానికి సినిమా బృందం సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి.ఇక ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి మంచి విజయం అందుకుంటే ఇక ఆయనకు మరి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.