దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు నిలిచి పోయిన విషయం తెల్సిందే.తెలుగు సినిమాలతో పాటు అన్ని భాషల సినిమాలు కూడా నిలిచి పోయాయి.
చాలా వరకు సినిమా షూటింగ్ లు నిలిచి పోయాయి.కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించేందుకు ముందు నిలిచి పోయాయి.
ఇప్పటికే అనుకున్న సినిమాలు కొన్ని రద్దు అయ్యాయి.ఈ ఏడాది ఆరంభంలో జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.
ఈ అమ్మడి హైట్ కారణంగా ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు.ప్రస్తుతం ఉన్న హీరోల్లోకి ఈమె కాస్త హైట్ ఎక్కువగా ఉంది.
దాంతో ఆమెకు ఆఫర్లు తక్కువగా ఉంటాయి.ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఫరియా అబ్దుల్లా కు అనూహ్యంగా ఆఫర్ ఒకటి వచ్చింది.
ఆ ఆఫర్ కరోనా సెకండ్ వేవ్ తో కొట్టుకు పోయింది.
ఫరియా కు వచ్చిన సెకండ్ ఛాన్స్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మొత్తం టాలీవుడ్ నిలిచి పోయింది.
ఎక్కడికి అక్కడ లాక్ డౌన్ తో ఆగిపోయిన ఇండస్ట్రీలో కొత్త సినిమాల ప్రారంభం ఈమద్య అయ్యేలా కనిపించడం లేవు.దాంతో ఆ సినిమా ఎప్పటికి ప్రారంభం అయ్యేది తెలియడం లేదు.
ఒక యంగ్ హీరోతో కొత్త దర్శకుడు మొదలు పెట్టాలనుకున్న ఆ సినిమా కాస్త ఆగిపోవడంతో మళ్లీ ప్రారంభం అయ్యే విషయమై స్పష్టత లేదు.దాంతో చిట్టికి సెకండ్ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి పోయిందంటూ ఆమె సన్నిహితులు వాపోతున్నారు.
జాతి రత్నాలు సినిమా సక్సెస్ అవ్వడంతో నవీన్ పొలిశెట్టి వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.దర్శకుడు మరియు కమెడియన్స్ కూడా ఫుల్ బిజీ అయ్యారు.కాని హీరోయిన్ ఫరియా మాత్రం సెకండ్ ఛాన్స్ కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.