చిట్టి నీ నవ్వంటే… అంటూ ఎంతో మంది కుర్రాళ్లను తన మాయలో పడేసిన పొడుగు సుందరి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జాతి రత్నాలు సినిమా ద్వారా వెండితెర ఆరంగ్రేటం చేసిన ఈ పొడుగు బామ ఇటు గ్లామర్ పరంగా అటు నటనాపరంగా ఎంతోమంది కుర్రాళ్లను మాయ చేసింది.
తాను నటించిన మొదటి సినిమానే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ తన తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.
హైదరాబాద్ కి చెందిన ఈ బ్యూటీ జాతి రత్నాలు సినిమా ద్వారా ఎంతో మందిని ఆకట్టుకుంది.
అయితే ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సినిమాలు ప్రకటించని ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా రోడ్డుపై తీన్మార్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
డ్రమ్స్ శబ్దం రాగానే తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని డ్రమ్స్ పవర్ అంటే అది అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.అయితే పట్టు చీర కట్టుకుని ఎంతో అందంగా ముస్తాబై రోడ్డుపై తీన్మార్ స్టెప్పులు వేయడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈమె మంచు విష్ణు శ్రీనువైట్ల కాంబినేషన్లో ఢీ చిత్రానికి సీక్వెల్ చిత్రంలో హీరోయిన్ గా నటించడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.