సంక్రాంతి కానుకగా తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్ద వార్ జరగనుంది.ఈ సంక్రాంతి బరిలో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలతో పోటీ పడుతున్నారు.
వీరికి పోటీగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా దర్బార్ సినిమాతో మనముందుకు వస్తున్నాడు.అయితే వీరందరితో పాటు తాను కూడా పోటీ ఇస్తానంటున్నాడు ఓ మంచివాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎంత మంచివాడవురా’ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అయ్యాడు.ఈ సినిమాకు దర్శకుడు సతీష్ వేగ్నేశ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది.
గతంలోనూ ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి రెండు పెద్ద సినిమాల మధ్య శతమానం భవతి సినిమాను రిలిజ్ చేసి బ్లాక్బస్టర్ కొట్టాడు ఈ డైరెక్టర్.దీంతో ఈసారి కూడా అదే స్ట్రాటెజీని ఫాలో అవుతున్నాడు ఈ డైరెక్టర్.
అయితే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో కళ్యాణ్ రామ్ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని నందమూరి ఫ్యాన్స్ అందరూ ఒక్కటయ్యారు.మరి ఈ సినిమాను ఎంత వరకు హిట్ చేస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.