సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరగడంతో ఆయన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.అనుష్క శర్మ వల్ల కోహ్లీ మ్యాచ్పై దృష్టి పెట్టలేక పోయాడని అంటున్నారు.
లీగ్ల దశలో అనుష్క అక్కడ లేక పోవడం వల్లే కోహ్లీ రాణించాడని, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్లో అనుష్క స్టేడియంలో ఉండటం వల్లే కోహ్లీ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు అంటూ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.మ్యాచ్లో విరాట్ ఔట్ అయిన దగ్గర నుండి కూడా అనుష్కపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, జోకులు వస్తున్నాయి.
అనుష్క స్టాండ్స్లో ఒంటరిగా మ్యాచ్ చూస్తుందని, కేవలం రెండు నిమిషాల్లోనే కోహ్లీ ఔట్ అయ్యి, అనుష్కను చేరుకున్నాడని, అనుష్కను వదిలి కోహ్లీ కొంత సేపు కూడా ఉండలేక పోతున్నాడు అంటూ జోక్స్ పేలుతున్నాయి.కోహ్లీ ఔట్ అయిన సమయంలో అనుష్క శర్మ ఫీలింగ్ ఎంటి అనేది కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుపుకుంటున్నారు.
మొత్తానికి కోహ్లీ క్వార్టర్ ఫైనల్ మరియు సెమీ ఫైనల్లో విఫలం అవ్వడానికి కారణం అనుష్క శర్మ అని క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే కొందరు అనుష్క శర్మది ఏం తప్పు లేదు అనే వారు కూడా ఉన్నారు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ, అనుష్క శర్మ తప్పేంలేదని, ఆమెను తప్పుబట్టడం సరికాదని అన్నాడు.