మాస్ రాజా రవితేజ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న క్రాక్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు రవితేజ.
కాగా ఈ సినిమా తరువాత రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను రవితేజ మార్క్ చిత్రంగా తెరకెక్కించేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడట.అయితే ఈ సినిమా కథను తొలుత విక్టరీ వెంకటేష్ కోసం రెడీ చేశాడట డైరెక్టర్.
కానీ ఆయన ఈ సినిమా తనకు సెట్ అవ్వదని నో చెప్పాడట.దీంతో రవితేజ ఈ సినిమాకు ఓకే చెప్పాడట.కానీ ఇప్పుడు ఇదే ఆయనకు కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉందట.
ఇప్పటికే రవితేజ సరైన హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది.
ఇలాంటి సమయంలో ఏది పడితే ఆ కథను ఓకే చేస్తూ దూసుకుపోవడం అవసరమా అంటూ మాస్ రాజా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఆలస్యమైనా ఒక హిట్టు సినిమా కథను ఓకే చేయాలి కానీ ఇలా దూకుడుగా ఎందుకు ఓకే చేస్తున్నాడంటూ తమ హీరోపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.