క్రికెట్ అభిమానులు చూపించే ప్రేమ మరో లెవల్ లోనే ఉంటుంది.కప్ గెలిస్తే గనక ఏకంగా గుడుల్లో పూజలు చేసేస్తారు క్రికెట్ ఫ్యాన్స్.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది.అదేంటంటే రీసెంట్ గా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమ్ ఇండి దుమ్ములేపింది.
రెండో టెస్ట్ మ్యాచ్లో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.అయితే ఈ విజయం వెనక కీలక పాత్ర పోషించాడు ఫేసర్ మహమ్మద్ సిరాజ్.
మన హైదరాబాదీ ఫేసర్ కావడం అలాగే ఏకంగా ఈ టెస్టు మ్యాచ్ లో 8 వికెట్లు తీసి సంచలన రేపడంతో అతడి హైదరాబాదీ ఫ్యాన్స్ గ్రాండ్ గా విషెస్ చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా ఆయనకు కటౌట్ ఏర్పాటు చేసేశారు అభిమానులు.
అయితే వాస్తవానికి ఇలాంటి కటౌట్లు కేవలం సినిమా హీరోలకు లేదంటే పెద్ద పెద్ద రాజకీయనాయకులకు వేయడం మనం చూస్తూ ఉంటాం.కానీ తొలిసారి ఒక ఫేసర్కు ఈ అరుదైన గౌరవం దక్కింది.
ఈ కటౌట్ను చూస్తే నోటిపై వేలు వేసుకున్నట్లు ఉంది.సిరాజ్ ఫొటో ఓ చోట ఇలా భారీగా కటౌట్గా మార్చేసి మొత్తం పూల దండలతో రెడీ చేసి నానా హంగామా చేశారు ఫ్యాన్స్.
అయితే ఇక్కడ ఇక సిరాజ్ కటౌట్ను ఇలా నోటిపై వేలు వేసుకునేలా ఏర్పాటు చేయడానిక ఓ కారణం ఉందంట.
అదేంటంటే సిరాజ్ గ్రౌండ్లో ప్రత్యర్థుల వికెట్లు తీసిన ప్రతీసారి కూడా ఏం మాట్లాడొద్దు అన్నట్లు ఇలాగే నోటిపై వేలు వేసుకుని సైగలు చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం.ఇక ఇప్పుడు సిరాజ్ కటౌట్ను అభిమానులు ఇలా రెడీ చేసి ఈ ఫొటోను కాస్తా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ సిరాజ్ సూపర్ స్టార్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేశారు.ఇక ఇలా ట్వీట్ చేయడం ఆలస్యం ఈ ఫొటో కాస్తా నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
ఎంతైనా క్రికెట్కు మన ఇండియాలో ఉండే అభిమానం ఈ రేంజ్ లోనే ఉంటుందని అంతా కామెంట్లు చేస్తున్నారు.