తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనుపమ తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
తెలుగులో అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.అనుపమ మొదటి నుంచి నటనకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ కెరిర్ పరంగా దూసుకుపోతోంది.
అనుపమ కు యూత్ లో ఎవరితోనైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమకు చేదు అనుభవం ఎదురయింది.
ఇటీవల అనుపమ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్ళింది.
సూర్యాపేట జిల్లా లోని కోదాడ పీపీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది.
ఇక అనుపమ వస్తుంది అని అక్కడికి భారీగా అభిమానులు తరలి వచ్చారు.కొద్దిసేపు అక్కడ అభిమానులు స్థానికులతో కిక్కిరిసిపోయింది.షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత అనంతరం అనుపమ కాసేపు మీడియాతో ముచ్చటించింది.ఆ తర్వాత ఆమె తిరిగి బయలుదేరుతుండగా కొందరు ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం నిలబడ్డారు.
షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన అనుపమ అప్పటికీ చాలా లేట్ అవ్వడంతో అక్కడి నుంచి వెళ్లి పోవడానికి సిద్ధపడింది.
కానీ అభిమానులు మాత్రం కాసేపు ఇక్కడే ఉండాలి అంటూ డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఆమె కారు టైర్ లలో గాలి కూడా తీశారు.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తీరుకు అనుపమ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఆ తరువాత షాపింగ్ మాల్ నిర్వాహకులు అనుపమ కు మరొక కారు ఏర్పాటు చేసి ఆమెను హైదరాబాదుకు పంపించారట.ఏది ఏమైనప్పటికీ అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ డమే కాకుండా అనంతరం ఆమె కారుకీ గాలి తీయడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అనుపమ సినిమాల విషయానికొస్తే ఇటీవలే విడుదలైన రౌడీ బాయ్స్ సినిమాలో సందడి చేసింది.అనుపమ తాజాగా నటించిన 18 పేజెస్ ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
అలాగే ప్రస్తుతం అనుపమ కార్తికేయ 2, బటర్ ఫ్లై లాంటి నటిస్తూ బిజీ బిజీ గా ఉంది.