నటి రష్మిక మందన తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని పేరు.2017లో కిరాక్ పార్టీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండ సినిమాలో నటించింది.అయితే గీత గోవిందం సినిమా సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇక ఆ తరువాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కొంత రష్మికను నిరాశపరచినా సూపర్ స్టార్ మహేష్ బాబుకు జతగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక ఒక్కసారిగా గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ తో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు, తమిళం సినిమాలలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఉన్న లీడ్ హీరోయిన్ లలో ఒకరిగా సినిమా పరిశ్రమలో రష్మిక చక్రం తిప్పుతోంది.అయితే అభిమానులు రష్మిక పై ఫైర్ అవుతున్నారు.
తాజాగా కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక తనదైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చింది.అయితే రష్మిక మాట్లాడుతుండగా అభిమానులు సూర్యసూర్య అని అరుస్తున్న సందర్భంలో ఏహ్ ఆగండి నా ఫ్లైట్ టైం అయిపోతోంది.
అరవకండి అని ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసింది.ఇక ఇలా మాట్లాడిన రష్మికపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.స్టార్ హీరోలు కన్నా మేడం గారు చాలా బిజీనా అని అభిమానులు ఫైర్ అవుతున్నారు.ఏది ఏమైనా రష్మిక వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.