కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా విడుదల గురించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది.
సినిమా ప్రమోషన్ మొదలు పెట్టాల్సి ఉండగా విడుదల ఉందా లేదా అనే అనుమానాలతో సినిమా మీడియాలో నిలిచింది.మొదట అనుకున్నదాని ప్రకారం అయితే కేజీఎఫ్ 2 ను వచ్చే నెలలోనే విడుదల చేయాల్సి ఉంది.
కాని పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు.ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదు అన్నట్లుగానే మేకర్స్ వ్యవహరిస్తున్నారు.
జూన్ చివరి వరకు పరిస్థితి కుదుట పడితే జులై లో థియేటర్లు ఓపెన్ అయితే సినిమా ను విడుదల చేస్తారేమో అనుకున్నారు.కాని ఇప్పటికే సినిమా విడుదల తేదీని మార్చేశారనే వార్తలు వస్తున్నాయి.
సినిమా ను విడుదల చేసేందుకు ఇది సరైన సమయం కాదని ఖచ్చితంగా వాయిదా వేసి తీరాల్సిందే అంటున్నారు.ఆగస్టులో పరిస్థితులు కుదుట పడితే తప్ప ఖచ్చితంగా మళ్లీ సినిమా ను వాయిదా వేయాల్సిందే అంటన్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను సెప్టెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం సినిమా నిర్మాణం పూర్తి అయ్యింది కనుక విడుదల తేదీ ఏ సమయంలోనే ఉండే అవకాశం ఉంది.అభిమానులు ఈ విషమయై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ ఉంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నాడు.
ఆయన ప్రస్తుతం సలార్ సినిమా తదుపరి షెడ్యూల్ కు ఏర్పాట్లు చేస్తున్నాడట.ప్రేక్షకులు రిలీజ్ విషయంలో కిందా మీద అవుతున్న ఈ సమయంలో ఎందుకు ప్రశాంత్ నీల్ స్పందించడం లేదు అంటున్నారు.
నెట్టింట ప్రశాంత్ నీల్ ను భయ్యా రిలీజ్ విషయం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.