చందమామ వంటి అద్బుతమైన సినిమాను తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ప్రస్తుతం రంగమార్తాండకు సంబంధించిన ప్రకాష్ రాజ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆయన రమ్యకృష్ణతో ఉన్న ఫొటో చాలా సహజంగా భలే ఉన్నాడే ప్రకాష్ రాజ్ అన్నట్లుగా ఉంది.
సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఆ పోస్టర్ ఉంది అనడంలో సందేహం లేదు.సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా రెండు మూడు ఏళ్లు అవుతుంది.
అయినా ఇప్పటి వరకు సినిమా ను విడుదల మాత్రం చేయడం లేదు.సినిమా లో బ్రహ్మానందం పాత్రను అద్బుతంగా చూపించబోతున్నట్లుగా ఆమద్య ఒక ఫొటోను విడుదల చేశాడు.
ఇక రాహుల్ సిప్లిగంజ్ మరియు శివాత్మిక రాజశేకర్ నటించబోతున్నట్లుగా ఒక వార్త వచ్చింది.
మొత్తానికి రంగమార్తాండ నుండి పోస్టర్ లు ఫొటోలు మాత్రమే వస్తున్నాయి.
ఇప్పటి వరకు సినిమా పూర్తి అయ్యిందా అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.కనీసం ఈ ఏడాదిలో అయినా సినిమా వస్తుందా అంటే చెప్పలేం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లుగా కూడా దాఖలాలు లేవు.దాంతో ఏం జరుగుతుందో అన్నట్లుగా కొందరు అనుమానంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అసలు విషయం కృష్ణవంశీ నోరు విప్పితే కాని తెలియదు.కాని ఆయన మాత్రం అస్సలు నోరు విప్పడం లేదు.
దాంతో పోస్టర్ లు మరియు ఫొటోలేనా సినిమా వచ్చేది ఉందా కృష్ణవంశీ గారు అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.