అలనాటి అందాల తార శ్రీదేవి గురించి తన నటన గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ లేరు.ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకున్న ఈ తార.
ఈ లోకాన్ని విడిచిన కూడా ఆమె పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంటారు అభిమానులు.ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఇప్పుడే కాదు ఒకప్పుడు కూడా ఈమంటే పడి చచ్చేవాళ్ళు అభిమానులు.ఇదిలా ఉంటే ఈమెను పెళ్లి చేసుకునేందుకు ఏకంగా తల్లితో వచ్చాడు ఓ అభిమాని.
ఒకప్పుడు ఇప్పుడున్నన్ని అవసరాలు లేవని అందరికీ తెలుసు.అలా ఆ సమయంలో ఫోన్స్ లేకపోవడంతో ఉత్తరాల ద్వారా అభిమాన నటులకు తమ మనోభావాలు తెలిపేవారు.అలా ఒకసారి ఓ అభిమాని శ్రీదేవి తండ్రి అడ్రస్ కి శ్రీదేవికి ఉత్తరాలు రాసేవాడు.అవన్నీ తన తండ్రి చదివి పక్కన పడేసేవాడు.
అలా ఓసారి అతను.తన దగ్గర రెండు లక్షలు ఉన్నాయని, తను ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నానని రాశాడు.
అంతేకాకుండా మీ కూతురు శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలి.ఆమెను కష్టపెట్టకుండా బహు జాగ్రత్తగా చూసుకుంటానని.ఏవేవో రాసి పంపించాడు.
అలా శ్రీదేవి తండ్రి పట్టించుకోకుండా చదివి పక్కన పడేసాడు.
ఓసారి మళ్లీ మరో ఉత్తరంలో ఫలానా తేదీకి తన తల్లితో మద్రాస్ కు వస్తానని ఉత్తరాన్ని రాసి పంపించగా.అప్పుడు కూడా అలాగే చింపేశారు శ్రీదేవి తండ్రి.మొత్తానికి ఆ వ్యక్తి ఓరోజు టక్ వేసుకొని, కూలింగ్ గ్లాస్ ధరించి తన తల్లితో వచ్చాడు.ఇక శ్రీదేవి తండ్రి అతన్ని చూసి ఎవరో అనుకున్నాడు.తర్వాత అతను అసలు విషయం చెప్పాక.అతనితో మాట్లాడుతున్న సమయంలో.
శ్రీ దేవి తల్లి వచ్చి ఆ వ్యక్తి తల్లిపై బాగా అరిచింది.ఇక్కడి నుంచి వెళ్ళిపొండి అంటూ వారిపై విరుచుకుపడింది.
అంత గొడవ అవుతున్నా కూడా అతడు కూలింగ్ గ్లాస్ తీయకపోయేసరికి శ్రీదేవి తండ్రి సందేహం వచ్చి తీయడంతో అతడికి ఒక కన్ను లేదు.అలా వారికి కౌంటర్ ఇచ్చి పంపించేశారు.ఇదంతా శ్రీదేవికి తెలియకుండానే జరిగిందని ఓ సారి తన తండ్రి తనకు చెప్పాడని ఆ సమయంలో బాగా నవ్వుకున్నానని శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.