తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ హాస్య నటుడు వడివేల్ బాలాజీ ఈ రోజు ఉదయం (గురువారం) స్వర్గీయులయ్యారు.
గుండెపోటుతో ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.వడివేల్ బాలాజీకి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
బాలాజీ హఠాత్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.‘అధు ఇడు ఎడు, కలకపోవతు యారు’ వంటి టీవీ షోలల్లో నటించి వడివేల్ ప్రత్యేక గుర్తింపును పొందారు.
ఈ షోల ద్వారానే పాపులారిటిని సంపాదించుకున్నాడు.
గుండెపోటు సమస్యతో బాధ పడుతున్న వడివేల్ బాలాజీని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.
ఆర్థిక సమస్యతో బాలాజీ కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి మార్చారు.ప్రభుత్వ ఆస్పత్రిలో 15 రోజుల పాటు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.ప్రముఖ హాస్యనటుడు వడివేల్ ను అనుసరిస్తూ నటించడంతో బాలాజీకి వడివేల్ బాలాజీగా పేరు వచ్చింది.తమిళంలో పలు సినిమాల్లో నటించిన బాలాజీ పలువురి ప్రశంసలు పొందాడు.
‘ఎన్ రాసవిన్ మనసిలే’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలాజీ చివరిసారిగా నటి నయనతార నటించిన కోలమావు కోకిలా సినిమాలో నటించాడు. వడివేల్ మరణవార్తతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.