తెలుగు బాపు బొమ్మ, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.వరుస ఆఫర్ లతో తెగ దూసుకుపోతుంది.
తన అందం, నటనతో ఎంతోమంది అభిమానుల మనసులను దోచుకుంది.ఇక ఆమె పాత్రలు ఎంతో హోమ్లీగా ఉండటమే కాకుండా తన కోసమే ఆ పాత్ర అన్నట్టు అనిపిస్తుంది.
ఇక ఈ బాపు బొమ్మ సోషల్ మీడియాలో బాగా ట్రెండీగా ఉంటుంది.
కీర్తి బాలనటిగా మలయాళం సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయింది.
ఆ తర్వాత తమిళ సినిమాలలో కూడా నటించగా అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఇక 2016 హీరో రామ్ సరసన నేను శైలజ సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం కాగా.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశం అందుకుంది.కానీ ఆమెకు మంచి గుర్తింపు అందించిన మహానటి సావిత్రి కథతో తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి ఎంత అద్భుతంగా నటించిందో మాటల్లో చెప్పలేనిది.ఈ సినిమా ద్వారా ఎంతో గుర్తింపు అందుకొని మహానటి అనే గుర్తింపుని అందుకుంది.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను తెగ అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా కీర్తి ఓ ఫోటోను షేర్ చేయగా అందులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ రెస్టారెంట్ లో కలిసి భోజనం చేస్తున్న ఫోటో పంచుకుంది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక తమిళంలో అన్నాత్తే సినిమాలో, మలయాళంలో భరత్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.ఇక మరో లేడీ ఓరియంటెడ్ గుడ్ లక్ సఖీ సినిమాలో నటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన రంగ్ దే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.మొత్తానికి కీర్తి సురేష్ వరుస ఆఫర్ లతో తెగ బిజీగా మారింది.