సాధారణంగా
అద్దం
ఖరీదు ఎంత ఉంటుందనే ప్రశ్నకు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు 30 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అద్దం సైజును బట్టి ఉండవచ్చని చెబుతారు.అయితే ఒక అద్దం ఖరీదు మాత్రం ఏకంగా ఏడున్నర లక్షల రూపాయలు.
వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా రాజుల కాలం నాటి చరిత్ర ఉన్న ఆ అద్దం విలువ ఏకంగా ఏడున్నర లక్షలు కావడం గమనార్హం.ఇది సాదాసీదా అద్దం కాకపోవడం వల్లే ఇంత ధర పలుకుతోంది.
విచిత్రం ఏమిటంటే ఈ అద్దాన్ని చాలా సంవత్సరాల నుంచి వినియోగిస్తున్న కుటుంబ సభ్యులకు సైతం ఈ అద్దం విలువ తెలియకపోవడం గమనార్హం.ఫ్రాన్స్ దేశానికి చివరి యువరాణి అయిన మేరీ ఆంటోనిట్టే ఈ అద్దాన్ని వినియోగించారు.
అందువల్లే ఈ సాధారణ అద్దం విలువ ఏడున్నర లక్షల రూపాయలు పలుకుతోంది.సాధారణంగా పాతకాలం నాటి వస్తులకు, ప్రముఖులు వినియోగించిన వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
అదే విధంగా మేరీ ఆంటోనిట్టే వాడిన ఈ అద్దం 200 ఏళ్ల క్రితం నాటిదని 100 సంవత్సరాలకు అటూఇటుగా ఈ అద్దానికి నగిషీలను చెక్కారని తూర్పు బ్రిస్టల్ వేలం కంపెనీ చెబుతోంది.మేరీ ఆంటోనిట్టే వాడిన ఈ అద్దాన్ని ఆమె జీవించి ఉన్న సమయంలోనే మూడవన్ నెపోలియన్ భార్య అయిన ఎంప్రెస్ యూజీ కొనుగోలు చేసింది.
ఆమె వారసులు సైతం అదే అద్దాన్ని వినియోగించారు.అక్కడి నుంచి ఒక కుటుంబానికి ఈ అద్దం చేరగా వాళ్లు 40 సంవత్సరాలుగా ఇదే అద్దాన్ని వినియోగిస్తున్నారు.
చరిత్రతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన అద్దం కావడంతో ఈ అద్దం ఇంత ఖరీదు చేస్తోంది.గతంలో కూడా రాజులు, ప్రముఖులు వాడిన వస్తువులు, దుస్తులు, వెంట్రుకలు లక్షల రూపాయలకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.