టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హన్మకొండ జిల్లా హరిత హోటల్ లో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
హుజురాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను దిశా నిర్దేశం చేస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఇంత నిర్భంధంలోనూ హుజూరాబాద్ ప్రజలు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు.
హుజూరాబాద్లో బీజేపీ గెలుపు ఖాయమని మెజారిటీపైనే చర్చ ఉంటుందన్నారు.కేసీఆర్ కుటుంబం అబద్దాల పూనకం ఊగుతోందని మండిపడ్డారు.
సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అన్న కేసీఆర్కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.కాంగ్రెస్తో కలిసే ఖర్మ మాకేంటి అని అన్న కిషన్ రెడ్డి అలాంటి చీకటి ఒప్పందాలు కేసీఆర్కే సాధ్యమని అన్నారు.