కరోనా వైరస్ ఎవరికి చెప్పి రాదు.మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కసారి బయటకు వెళ్తే చాలు మనకే తెలియకుండా మనకు అటాక్ అయ్యి ఉంటుంది.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ కోడలుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.కరోనా వచ్చిందని కోడలిని ఇంట్లోకి రానివ్వలేదు ఓ అత్త.
ఇంకా ఈ అమానుష ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది.
పూర్తి వివల్లోకి వెళ్తే.
నెల్లూరులోని 15వ వార్డ్ లో ఇద్దరు దంపతులు ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నారు.అయితే మొదట భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని ఆస్పత్రిలో చేరారు.
అనంతరం భార్యకు కరోనా వచ్చింది.కానీ ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో హోమ్ ఐసోలేషన్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
అయితే కోడలికి కరోనా పాజిటివ్ అని అత్త ఇంట్లో రానివ్వలేదు.ఇందుకు ఆమె మరదలు కూడా ఆమెను ఇంట్లోకి రానీయవద్దని చెప్పేసారు.దీంతో ఆమె గత రెండు రోజులుగా రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే ఈ విషయం మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు తెలియడంతో బాధితురాలికి వైద్యం అందించాలని స్థానిక ఆస్పత్రికి ఫోన్ చేసి కోరారు.
దీంతో ఆమెను 108లో వైద్యశాలకు తరలించారు.ఏది ఏమైనా కరోనా వైరస్ వస్తే సొంత ఇంట్లో మనుషులే దూరం పెడితే బయట వాళ్ళు మాత్రం వివక్ష చూపకుండా ఎలా ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.