గురువు దైవంతో సమానం అంటారు.కానీ నేటి సమాజంలో వావివరసలు మరిచే మనుష్యులు తాము గురువులమని, విద్యార్ధులను కాపాడాల్సిన బాధ్యత కూడా తమకు ఉందని మర్చిపోతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుని స్థానికంగా కలకలం సృష్టించింది.గిరిజన సంక్షేమ హాస్టల్లోని ఓ వార్డెన్ తనలోని కీచకుడిని బయటకు చూపించాడు.
బోథ్ గిరిజిన సంక్షేమ హాస్టల్లోని విద్యార్థినిలపై ఆ హాస్టల్ వార్డెన్ లైంగిక వేధింపులు చేయసాగాడు.హాస్టల్లోని 8వ తరగతిలో చదువుతున్న విద్యార్ధినిని మానసికంగా వేధించాడు.
బాత్రూమ్లోకి వచ్చి ఆమెను ముద్దులు పెట్టాల్సిందిగా సదరు వార్డెన్ వసంతరావు వేధింపులకు గురిచేశాడు.దీంతో ఆ బాలిక బెదిరిపోయి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది.
దీంతో వారు కుటుంబ సభ్యులతో కలిసి హాస్టల్ ముందు ధర్నాకు దిగారు.
అయితే ఈ లోగా అటువైపు వచ్చిన వార్డెన్ వసంతరావును పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ముద్దులుగా అడుగుతావా అంటూ మూతి పగలగొట్టారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.