పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో రానా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో కీలక పాత్ర ను ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించిన రవీంద్ర విజయ్ చేయబోతున్నాడు.
దర్శకుడు ఈ విషయాన్ని అనధికారికంగా క్లారిటీ ఇచ్చాడు.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో ముత్తు పాండియన్ గా కనిపించిన రవీంద్ర విజయ్ ప్రస్తుతం తెలుగు కూడా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.
పవన్ మూవీ మాత్రమే కాకుండా మరో సినిమా ను కూడా ఈయన చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.వెబ్ సిరీస్ లో ఈయన నటనకు అంతా ఫిదా అయ్యారు.
కీలకమైన పాత్రలో తన పాత్ర మేరకు పూర్తి న్యాయం చేసిన రవీంద్ర మళ్లీ ఈ సినిమా లో కూడా ఆకట్టుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
జులై రెండవ వారంలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా రూపొందుతున్న ఈ రీమేక్ కోసం పవన్ డేట్లు ఇచ్చాడని ఆగస్టు మొదటి వారం వరకు పూర్తిగా ఈ సినిమా ను ముగించాలని భావిస్తున్నారు.
దీపావళికి ఈ సినిమా ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చిత్రీకరణ కోసం సెట్టింగ్స్ ను వేస్తున్నారు.రానా మరియు పవన్ లు ఈ సినిమా లో నటిస్తున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని మొదట్లోనే ప్రకటించారు.కాని ఈ సినిమా కరోనా వల్ల ఆలస్యం అవుతుందని అంతా అనుకున్నారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని అంటున్నారు.