ఓ కుటుంబంలోని 16 మందికి కరోనా సోకింది.వారిలో ఏకంగా ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు.
ఒకే ఇంట్లో ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.కుటుంబ సభ్యుల ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
చివరి చూపును కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది.కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగారు.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.రావులపాలెంలో ఓ కుటుంబంలో 16 మందికి కరోనా సోకింది.చికిత్స నిమిత్తం అందరూ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.వీరిలో 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురు మృతి చెందారు.
దీంతో వీరి కుటుంబంలో మూడు తరాలు కరోనా కాటుకు బలయ్యాయి.గతంలో కూడా కొన్ని కుటుంబాల్లో కరోనా విషాదం నింపింది.
కొన్ని కుటుంబాల్లో ఒకరితో సంక్రమించి కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెంది అనాథలుగా మిగిల్చింది.కరోనా ఏకంగా కుటుంబాలను సైతం పొట్టన పెట్టుకుంది.
ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు అన్ని జిల్లాలు, రాష్ట్రాల పరిస్థితి అలానే ఉంది.జిల్లాలో కేసులు అధికంగా నమోదై ప్రాణాలు కోల్పోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఒకే కుటుంబంలో ఎక్కవ మందికి కరోనా సోకితే వారికి అవగాహన కల్పిస్తూ వైద్యులు చికిత్స చేస్తున్నారు.