మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం సరికాదు..: తెలంగాణ బీజేపీ చీఫ్

False Propaganda Against Modi Government Is Wrong: Telangana BJP Chief

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.మోదీ పర్యటన సందర్భంగా పాలమూరులోని ప్రజాగర్జన సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 False Propaganda Against Modi Government Is Wrong: Telangana Bjp Chief-TeluguStop.com

తొమ్మిదేళ్ల పాలనలో రూ.9 లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులున్నారన్న ఆయన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తే హాజరు కావడానికి సీఎంకు తీరిక ఉండదని ఎద్దేవా చేశారు.

సీఎం తనకు,తన కొడుక్కి అధికారం ఉండాలంటారన్నారు.కేసీఆర్ గతంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.

అదేవిధంగా కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి ఓటేసినట్లేనని స్పష్టం చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube