కరోనా నియంత్రణలో విఫలమైన జగన్.. ఏపీలో టీడీపీ నేతల దుమారం.. ?

నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు.కానీ రాజకీయ నాయకుల నోర్లు మాత్రం ఎప్పుడు ఏదో ఒక వివాదస్పదమైన విషయాలను చుట్టేస్తాయి.

 False Case Against Chandrababu Tdp Leaders Sensational Comments , False Case Aga-TeluguStop.com

ఇలా నోరు అదుపులో పెట్టుకోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు ఉన్నారు.ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ సుబ్బయ్య అనే న్యాయవాది కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే చంద్రబాబు పై కేసు పెట్టడాన్ని టీడీపీ దుయ్యబట్టింది.

ఈ నేపధ్యంలో కరోనా నియంత్రణలో విఫలమైన జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా ఎన్440కె వైరస్‌ పై మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించినంత మాత్రాన తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు దుయ్యబట్టారు.భావప్రకట స్వేచ్చను ఇలా తప్పుడుగా చిత్రికరించి కేసు నమోదు చేయడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, సాధారణ పౌరులు కూడా కరోనాపై తమ గళాన్ని స్వేచ్ఛగా వినిపించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు.

ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబు పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు.మొత్తానికి ఈ అంశం పై ఏపీలో పెద్ద దుమారమే మొదలైనట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube