హైదరాబాద్ లో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది.బాలానగర్, రాజేంద్రనగర్ లో సోదాలు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
పావని బ్రాండ్ పేరుతో ఫేక్ విత్తనాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో సోదాలు నిర్వహించిన అనంతరం సుమారు ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.