నిజం.ఆ కండెక్టర్ కలెక్టర్ కాలేదు.
ఆశ్చర్యం వేస్తుందా? అవును నిజంగానే ఆ కండెక్టర్ ప్రజలందరినీ దారుణంగా మోసం చేశాడు.ఎంత దారుణంగా అంటే ? అతను ప్రస్తుతం కండెక్టర్ అని.త్వరలోనే కలెక్టర్ అవుతాను అని ఓ మీడియాతో చెప్పాడు.ఇంకా అంతే ఆ మీడియా వెనుక ముందు ఆలోచించకుండా అతని గురించి ఓ రేంజ్ లో ప్రచారం చేశారు.
ఇంకా మిగితా మీడియాలు వూరికే ఉంటాయా? అవి కూడా అంతే.మరుసాటి రోజు.
అతను నిజంగానే కలెక్టర్ అయినట్టు.అతని వద్దకు వెళ్లి ఇంటర్వ్యూలు.
కండెక్టర్ గా అతను టిక్కెట్లు ఇస్తున్న ఫోటోలు తీసి అతని మీద ఓ రేంజ్ లో ఆర్టికల్స్ రాశాయి.అతను కూడా చెప్పాడు.7 గంటలు కండెక్టర్ ఉద్యోగం చేసి 5 గంటలు చదివేవాడు అని.
ఇంకా అందరూ.”ఇంతకన్నా గొప్ప విజయం ఉంటుందా? కండెక్టర్ నుండు కలెక్టర్ వరుకు” అని టైటిల్స్ పెట్టేసి మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు రాసేశారు.నిజమే.
కండెక్టర్ నుండి కలెక్టర్ వరుకు అంటే గొప్ప విజయమే కానీ అది అతను చెప్పిన అబద్దం.అది ఎలా మీడియాలో రాస్తారు ? నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా?
దీంతో ఆ కండెక్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాడు.ఒక్క రోజులో స్టార్ పబ్లిసిటీ వచ్చింది.అయితే ముంబైలో ఓ ప్రముఖ పత్రిక పాత్రికేయుడుకు సందేహం రావడంతో అసలు నిజం బయట పడింది.సివిల్స్ లో సెలెక్ట్ అయినా వారి జాబితాను పరిశీలించగా అక్కడ ఆ కండెక్టర్ పేరు మధు లేదు .మధుకుమారి అనే ఒక అమ్మాయి పేరు మాత్రం ఉంది.
దీంతో ఆ పత్రిక వారు సోషల్ మీడియా నుండి ఆ వార్తలు తొలిగించారు.అతను గ్రేట్ అని అనిపించుకోవడం ఏమో కానీ.చివరికి ఆ కండెక్టర్ కు తిట్లు.చివాట్లు మిగిలియి.
కండెక్టర్ సంగతి పక్కన పెడితే.మీడియా అయినా కాస్త తెలుసుకొని రాయద్ద? ఏదైనా ఒక వార్త వచ్చింది అంటే చాలు.అది నిజామా అబద్దమా అనేది కూడా తెలుసుకోకుండా మీడియాలో పెట్టేస్తారు.