ప్రస్తుత సమాజంలో రకరకాల దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి.టెక్నాలజీ( Technology ) వచ్చాక చాలామంది రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు.
ఇదే సమయంలో నకిలీ అధికారుల వేషంలో దొంగలు చెలరేగిపోతున్నారు.ఈ రకంగానే సికింద్రాబాద్ లో ఫేక్ ఐటీ అధికారుల రూపంలో మోండా మార్కెట్ లో హర్ష జ్యువలరీలో రెండున్నర కేజీల బంగారం కాజేశారు.
మేము ఐటి అధికారులమని… చెప్పి తనిఖీలు చేపట్టి హర్ష జ్యువలరీలో( Harsha Jewellery ) రెండున్నర కేజీల బంగారాన్ని కాజేశారు కేటుగాళ్లు.
బాధితులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు… నిందితులను పట్టుకోవడానికి గాలింపులు చేస్తున్నారు.ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ లో రికార్డు అయినా గేటుగాళ్ల వీడియోలు పరిశీలిస్తున్నారు.మొత్తం ఐదుగురు ఆరుగురు.
బైకుల మీద వచ్చినట్లు సిసి ఫుటేజ్ వీడియోలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.దీంతో ఐటీ అధికారులమని… జ్యువలరీ షాప్ యజమానులకు కొన్ని కార్డులు చూపించడం జరిగిందంట.
అయితే షాప్ యజమానులు.సరిగ్గా చదువుకోకపోవడంతో… గుర్తించలేని పరిస్థితి కావడంతో ఈలోపే కేటుగాళ్లు బంగారం దొంగిలించినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు.
నిందితులను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారని స్పష్టం చేశారు.