టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కి నకిలీ ఈడీ నోటీసులు పంపించడం మాత్రమేకాక త్వరలో అరెస్టు చేస్తామని ఆగంతకులు నోటీసుల్లో పేర్కొనటం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.ఈ పరిణామంతో మంత్రి గంగుల కమలాకర్… ఈడి అధికారులను సంప్రదించడం జరిగింది.
ఇదే తరుణంలో సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.నోటీసుల లో తాము చెప్పినట్టు చేయకపోతే అరెస్టు చేస్తామని వచ్చి సెటిల్ చేసుకోవాలని కూడా కమలాకర్ ని హెచ్చరించినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆగంతుకుల పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది.కేవలం నోటీసులు పంపటం మాత్రమే కాక కెనడా నంబర్ తో గంగుల ప్రభాకర్ కి అగంతకులు ఐఓఎస్ కాల్స్ కూడా చేయడం జరిగిందట.దీంతో ఆగంతకులపై సైబర్ క్రైమ్ పోలీసులు.420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.అంతేకాకుండా దర్యాప్తు కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం.సాధారణంగా అధికారంలో లేకుండా ఉన్న వారిపై ఎటువంటి చర్యలు పాల్పడే అవకాశం ఉంటుంది కానీ టిఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో మంత్రిపై నోటీసులు పంపించడం.
అనేది పోలీసులకు కూడా ఈ కేసు ఇప్పుడు సవాలుగా మారింది.