ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియా మధ్య మాలను ఉపయోగించుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.అంతేగాక మరి కొందరు యువతులు కూడా ఆన్ లైన్ వ్యభిచారం పేరుతో డబ్బులను వసూలు చేస్తూ యువకులను ముంచేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే సత్యం అనే ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు.అయితే ప్రస్తుతం సత్యం కి లాక్ డౌన్ కారణంగా కాలేజీ లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.
ఈ క్రమంలో అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలను కాలక్షేపం కోసం ఉపయోగిస్తున్నాడు.దీంతో ఇటీవల ఫేస్ బుక్ మరియు టెలిగ్రామ్ వంటి మాధ్యమాలలో కాల్ గర్ల్స్ కి సంబంధించిన ఓ పోస్ట్ ని చూసాడు.
ఈ క్రమంలో కొందరు కేటుగాళ్ళు యువతుల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి తమతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలంటే గంటకి 200 రూపాయల నుంచి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారని తెలుసుకున్నాడు.దీంతో కుతూహలం ఎక్కువయిన సత్యం వారికి 500 రూపాయలు చెల్లించాడు.
ఆ తరువాత ఆ రిసిప్ట్ ను వారికి పంపించగానే సత్యం అకౌంట్ ని బ్లాక్ చేశారు.దీంతో ఒక్కసారిగా సత్యం ఖంగు తిన్నాడు.
అయితే ఈ విషయం ఎక్కడ బయటకు తెలిస్తే తన పరువు పోతుందని తనలో తానే మదన పడుతున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వల్ల ప్రయోజనాలకంటే నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాగే ఇలాంటి యువకులు మొదట్లో కాలక్షేపం కోసం సోషల్ మీడియాని ఉపయోగించినప్పటికీ క్రమక్రమంగా కొందరు కేటుగాళ్ల చేతిలో ఆర్థిక పరంగా మోసపోతున్నారు.దీంతో కనీసం ఇప్పటికైనా సోషల్ మీడియా అధికారులు ఈ విషయాలను గమనించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారి వివరాలను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.