ప్రజల నిర్లక్ష్యం అయితే నేమి, మొత్తానికి కరోనా కేసులు నమోదవడం మొదలైంది.అయినా గానీ ప్రజల్లో ఎలాంటి బెరుకు లేదు.
కరోనా నిబంధలను పక్కన పెట్టి వీరు వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే హద్దులు దాటింది.దీని ఫలితంగా దాదాపుగా అన్నీ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది.
ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం మొదలైంది.ఈ నేపథ్యంలో రాష్త్ర ప్రభుత్వాలు ప్రజలను కట్టడి చేయడానికి కఠిన చర్యలను అమలులోకి తీసుకువచ్చాయి.ఖచ్చితంగా కరోనా నిబంధలను పాటించాలని ఆదేశిస్తున్నాయి.ఇందులో భాగంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం చెప్తున్నా ప్రజలు వినడం లేదు.
అందుకే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పక ధరించాలని ఆదేశాలు జారీచేశాయి.
ముఖ్యంగా బెంగళూరు మహానగర పాలక సంస్థ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించిన వారికి రూ.250 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.అలాగే వేడుకలు, సంబరాలపై కొన్ని నిర్దిష ఆదేశాలను జారీ చేసింది.
ఈ నియమాలను ప్రజలు తూచ తప్పకుండా పాటిస్తే కరోనా నియంత్రణ సాధ్యం అవుతుంది.లేదంటే మరోసారి ఎదుర్కునే పరిస్దితులను ఊహించడం కష్టం.