అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమాలోని బన్నీ లుక్ రివీల్ చేసి సినిమా పై అంచనాలు ఆకాశానికి పెంచేసిన దర్శకుడు సుకుమార్ ఈ సినిమా లో విలన్ గా మలయాళ స్టార్ నటుడు పాహద్ ను ఎంపిక చేయడంతో అంచనాలు మరింతగా పెంచాడు.
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి.అది నిజమే అయినా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల తప్పుకుంటున్నట్లుగా స్వయంగా విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు.
మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమా షూటింగ్ మొదలయిన నేపథ్యంలో మలయాళ నటుడు పాహద్ ను విలన్ గా ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు.
మలయాళంతో పాటు పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరియు ఇతర భాషల ప్రేక్షకులకు మంచి పరిచయం అయిన ఫాహద్ వల్ల ఈ సినిమా రేంజ్ అమాంతం పెరిగి పోవడం ఖాయం.
ఫాహద్ ఫాసిల్ వల్ల సినిమాకు ఈజీగా పది కోట్ల అదనపు బిజినెస్ అవ్వడం ఖాయం అనే ఉద్దేశ్యంతో ఆయన డిమాండ్ చేసిన భారీ మొత్తంను ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో విలన్ గా నటించినందుక ఉగాను ఫాహద్ ఫాసిల్ ఏకంగా రూ.5 కోట్ల ను పారితోషికంగా అందుకోబోతున్నాడట.ఈ మొత్తం పారితోషికం ఇటీవల టాలీవుడ్ లో విలన్ గా తీసుకోవడం రికార్డ్ అంటున్నారు.
తెలుగు విలన్ పాత్రలకు ఈ మొత్తం ఇవ్వడం ఇదే గా చెప్పుకోవచ్చు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.