కార్మికుల కోసం ఎన్ని చట్టాలు వచ్చిన ఉద్యోగాల విషయాల్లో ప్రైవేట్ కంపెనీలు కఠిన వైఖరి ను చూపిస్తూ వారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.వాళ్ళు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం అవ్వకుండా వారి శ్రమను దోపిడీ చేస్తూ ఉద్యోగులను ఇంకా కష్టాల పాలు చేస్తున్నారు.
ఎన్ని చట్టాలు వచ్చిన వాటిని లెక్క చేయడం లేదు.ప్రభుత్వాలు కూడా కఠిన వైఖరిని అమలు చేయక పోవడంతో వారి ఆగడాలకు అంతం లేకుండా పోతుంది.
తాజాగా జరిగిన ఒక ఘటన కార్మికుల పై ఎంత వివక్ష చుపిస్తున్నారో వారిని ఎంత చిన్న చూపు చూస్తున్నారో అర్ధం అవుతుంది.వారికీ జీత భత్యాలు ఇవ్వకుండా హింసించడమే కాకుండా జీతాలు అడిగినందుకు నాణాలు ఇచ్చి అతడిని అవమానించారు.
దీంతో ఈ ఘటన బయటకు రావడంతో ఆ యాజమాన్యం పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.ఈ విషయం అక్కడ మేయర్ వరకు చేరడంతో ఆ యాజమాన్యంపై ఆయన సీరియస్ అయ్యాడు.
ఈ ఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది.‘నెక్స్ గ్రీన్ ఎంటర్ప్రైజెస్‘ అనే సంస్థ తమ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.అదేమిటి అని ప్రశ్నించగా ఒక కార్మికుడికి నాణాలు రూపంలో జీతం ఇచ్చి అవమాన పరిచారు.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో మేయర్ వరకు ఈ విషయం చేరుకుంది.ఆ మేయర్ విషయం తెలిసిన వెంటనే ఆ యాజమాన్యంతో భేటీ అయ్యారు.
ఇలా నాణాలు రూపంలో జీతం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా.ఆ సంస్థ ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, పొరపాటున జరిగిందని తెలపడంతో మేయర్ ఇంకా సీరియస్ అయ్యారు.5 నెలలుగా జీతాలు ఇవ్వాల్సి ఉండగా మొత్తం ఇవ్వకుండా కొంత మొత్తాన్ని నాణాలు రూపంలో చెలించడం అనేది ఆ కార్మికుడిని అవమాన పరచడమే అని ఆయన భావించి ఆ కంపెనీ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ వ్యక్తికి మాత్రమే కాదు మిగతా వారికీ కూడా పూర్తి జీతం అందేలా చర్యలు తీసుకుంటామని మేయర్ తెలపడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియడంతో మేయర్ ను నెటిజెన్స్ అభినందిస్తున్నారు.