సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు చాాలా గోప్యంగా ఉంచబడుతాయి.అందుకే వ్యక్తిగత వివరాలను భద్రంగా ఉంచడం కోసం ప్రొఫైల్ లాక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఫేస్ బుక్ వాడే వారి సంఖ్య చాలానే ఉంది.ఫేస్ బుక్ వల్ల చిన్ననాటి స్నేహితులు, కుటుంబంలో తప్పిపోయినవారు చాలా మందే కలుసుకున్న ఘటనలు ఉన్నాయి.
అయితే ఈ ఫేస్ బుక్ లో వ్యక్తిగత వివరాల విషయంలో ఫేస్ బుక్ చాలా అలర్ట్ గా ఉంటుంది.కాకపోతే వాటిలో ఉండే బగ్స్ వల్ల చాలా మందికి అనేక సమస్యలనేవి తలెత్తుతుంటాయి.
సైబర్ నేరాలకు పాల్పడేవారు సోషల్ మీడియాలోని కొన్ని బగ్స్ వల్ల నేరాలకు పాల్పడుతుంటారు.అలాంటిదే ఓ బగ్ ను ఇన్స్టాగ్రామ్ లో కనిపెట్టాడు.
21ఏళ్ల మయూర్ ఫర్తడే తన ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేటు అకౌంట్స్ ద్వారా కొందరి ఫోటోలను, వివరాలను దొంగిలించాడు.ఇలాంటి బగ్ వల్ల చాలా మంది ఇరుకునపడే అవకాశం ఉంది.
చాలా మంది వివరాలు దొంగలకు తెలిసి వారిని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది.వారిని డబ్బుల కొసం వేధింపులకు పాల్పడను కూడా చేయవచ్చు.
ఈ బగ్ అందుకు ఉపయోగించవచ్చని ఆ యువకుడు కనిపెట్టాడు.
దీంతో ఫేస్ బుక్ సంస్థ ఆ యువకుడికి భారీ నగదు బహుమతిని ఇచ్చింది.సోలాపూర్ కు చెందిన మయూర్ ఫర్తడే ఫేస్ బుక్ లో ఇటువంటి బగ్ ఉన్నట్లు ఏప్రిల్ లో తెలుసుకున్నాడు.కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేసిన మయూర్ ఇన్స్టాలో సైబర్ నేరగాళ్లు ఎలా ఇంకొకరి వివరాలు తెలుసుకోగలరో గుర్తించి చెప్పాడు.
కొన్ని ముఖ్యవిషయాలను కూడా కనిపెట్టాడు.ఇన్ స్టాగ్రామ్ ద్వారా లభించే వివరాలతో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు అటాచ్ అయిన ఫేస్ బుక్ పేజీలను సైతం యాక్సెస్ చేయొచ్చని ఆ యువకుడు తెలిపాడు.
ఏప్రిల్ 19న ఫేస్ బుక్ అతడికి రిప్లై ఇచ్చింది.ఆ తర్వాత ఆ లోపాన్నే సరిచేసి యువకుడికి జూన్ 15న రూ.22 లక్షలను ఇచ్చి సత్కరించింది.